Chandanotsavam 2026
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన సింహాచలం ఆలయంలో జరిగే ‘చందనోత్సవం’ వేడుక, భక్తులకు అత్యంత విశిష్టమైన వేడుక. కేవలం ఈ ఒక్క రోజున మాత్రమే భక్తులు స్వామివారి నిజరూప దర్శనాన్ని పొందగలరు. సంవత్సరమంతా స్వామివారు పూర్తిగా చందన లేపనంతో కప్పబడి ఉంటారు కాబట్టి, ఆయనను ఆయన నిజస్వరూపంలో దర్శించుకోవడం భక్తులు తమ గొప్ప అదృష్టంగా భావిస్తారు.
చందనోత్సవం 2026 తేదీ
- సోమవారం, ఏప్రిల్ 20, 2026.
- పంచాంగం ప్రకారం: వైశాఖ శుద్ధ తృతీయ (అక్షయ తృతీయ).
- ఈ పవిత్రమైన రోజునే, స్వామి వారి నిజ రూప దర్శనం కలుగుతుంది.
- ఆధ్యాత్మికంగా, ఈ రోజున స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల లభించే పుణ్యం అనేక రెట్లు వృద్ధి చెందుతుందని భక్తుల నమ్మకం.
చందనోత్సవం అంటే ఏమిటి?
శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహానికి సంవత్సరం పొడవునా చందనం పూసి ఉంటుంది.
- ఇది స్వామివారి ఉగ్రరూపాన్ని శాంతపరచడానికి ప్రతీక.
- అయితే, ఛందనోత్సవం రోజున ఆ చందనాన్ని తొలగించి (ఛందనోత్తర), భక్తులకు ఆయన నిజ రూప దర్శనం కల్పిస్తారు.
- ఈ అరుదైన ఘట్టాన్ని వీక్షించడానికి దేశం నలుమూలల నుండి లక్షలాది భక్తులు తరలివస్తారు.
చందనోత్సవం ప్రత్యేక దర్శనం
- ప్రారంభం: తెల్లవారుఝామున గం. 03:30 ని.ల నుండి.
- ముగింపు: రాత్రి గం. 07:00 వరకు.
- ఈ సమయంలోనే Nijaroopa Darshanam ఉంటుంది.
ముఖ్య సూచనలు & ఏర్పాట్లు
- దర్శనం నిలిపివేత: ఏప్రిల్ 19 సాయంత్రం 06:00 గంటల నుంచి స్వామివారి దర్శనం నిలిపివేయబడుతుంది.
- వాహనాల నియంత్రణ: ఏప్రిల్ 19 సాయంత్రం 06:00 తర్వాత సొంత వాహనాలను కొండపైకి అనుమతించరు. కేవలం వెహికల్ పాస్ ఉన్న వాహనాలనే అనుమతిస్తారు.
- ఉచిత రవాణా: భక్తుల కోసం కొండ దిగువ నుండి కొండపైకి 90 పైగా ఉచిత ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయబడ్డాయి.
- వసతులు: భక్తుల కోసం మంచినీరు, మజ్జిగ, పులిహోర మరియు ఉచిత లడ్డూ ప్రసాదం (40 గ్రాములు) పంపిణీ చేయబడుతుంది.
- ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నవారు మరియు స్లాట్ సమయాన్ని పాటించాలి.
- భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలి.
- ఆలయంలోనికి సెల్ ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవు.
ఉచిత దర్శన సౌకర్యం
సింహాచలం చందనోత్సవం సందర్భంగా భక్తుల కోసం ఉచిత దర్శన సౌకర్యం కల్పించబడింది. ఈ ఉచిత దర్శనం ఏప్రిల్ 20, 2026 (సోమవారం) తెల్లవారుఝామున గం. 03:30 నిమిషాల నుండి ప్రారంభమవుతుంది. సుమారు ఒక లక్షా యాభై వేల మందికి పైగా భక్తులు విచ్చేస్తారని అంచనా వేయడంతో, ఉచిత దర్శనం క్యూలైన్లను ఈసారి రెండు భాగాలుగా విభజించి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు క్రమశిక్షణతో, సావధానంగా ఉండి స్వామివారి నిజరూపాన్ని దర్శించుకోవాలని దేవస్థానం వారు కోరుతున్నారు
సంక్షిప్త వివరాలు
| అంశం | వివరాలు |
| ఉత్సవం పేరు | సింహాచలం చందనోత్సవం (నిజరూప దర్శనం) |
| తేదీ | 20 ఏప్రిల్ 2026 (సోమవారం) |
| పంచాంగం | వైశాఖ శుద్ధ తృతీయ / అక్షయ తృతీయ |
| దర్శనం సమయం | తెల్లవారుఝామున 03:30 – రాత్రి 07:00 |
| టికెట్ ధరలు | ₹300, ₹1000, ₹1500 |
| దివ్యాంగుల దర్శనం | ఉదయం 10:00 – 11:00 మరియు సాయంత్రం 04:00 – 05:00 |
| సాధారణ దర్శనాల నిలిపివేత | ఏప్రిల్ 19 సాయంత్రం 06:00 నుండి |
ముగింపు
సింహాచలం చందనోత్సవం భక్తులకు జీవితంలో ఒకసారి తప్పక చూడాల్సిన దివ్య దర్శనం. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకోవడం వల్ల అక్షయమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. 2026లో ఈ పవిత్ర అవకాశాన్ని మిస్ కాకుండా పైన పేర్కొన్న వివరాల ప్రకారం మీ యాత్రను ప్లాన్ చేసుకోండి.