Magha Puranam in Telugu
మాఘమాసం హిందూ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో నదీ స్నానాలు, పుణ్యక్షేత్రాల దర్శనం విశేషమైన ఆధ్యాత్మిక ఫలాలను అందిస్తాయని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం, ఈ మాసంలో చేసే ప్రతి పుణ్యకార్యం అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా, నదీ స్నానానికి ఈ మాసంలో విశిష్ట ప్రాధాన్యత ఉంది.
| అంశం | వివరణ |
|---|---|
| గంగానదితో సమానం | మాఘమాసంలో ఏ నదిలో స్నానం చేసినా అది గంగానదిలో స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. |
| పాప పరిహారం | జన్మజన్మల పాపాలు నశించి, భక్తులకు పునీతమైన జీవితం లభిస్తుందని నమ్మకం. |
| ఆధ్యాత్మిక శుద్ధి | శరీరాన్ని, మనస్సును శుద్ధి చేసి భగవంతునితో అనుసంధానాన్ని బలపరుస్తుంది. |
| ఆరోగ్య ప్రయోజనాలు | చలికాలంలో నదీ స్నానం చేయడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. |
అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రములో కలియుచోట మాఘ స్నాన మాచరించిన ఏడేడు జన్మలలోని పాపములు నశించిపోతాయి. మాఘమాసంలో నదీస్నానంతోపాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు మూడువందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలం కలుగుటయే గాక మళ్ళీ జన్మ అనేది కలుగదు.
పడమటి కనుమల దగ్గర త్ర్యయంబకమను ఒక ముఖ్యమైన క్షేత్రం ఉన్నది. అక్కడే పవిత్ర గోదావరీనది జన్మించింది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేసి, గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింప చేసాడు. మాఘమాసంలో గోదావరియందు స్నానం చేసినయెడల సకలపాపములు తక్షణం హరించి పోవుటయే గాక ఇహమందు పరమందు సుఖపడతారు.
గౌతమీనదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వమును చాటుతున్నవి. ‘పరంతప’ అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలసి ఉన్నాడు. దానికి ఆవల ప్రభావమను క్షేత్రం గలదు. ఆ క్షేత్రం బ్రహ్మ హత్యా మహాపాపములను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము చెపుతాను సావధానుడవై ఆలకించు.
విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకు, ఈశ్వరునికి ఐదేసి తలలు ఉండేవి. ఈశ్వరునకు పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. బ్రహ్మదేవుడు నాకు అయిదు తలలున్నవి, నేనే గొప్పవాడనని అనగా నాకు ఐదు తలలున్నవి నేనే గొప్ప వాడనని శివుడు వాదించారు. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాన వలె వారిద్దరిమధ్య కలహము పెద్ది అయింది. ఇద్దరూ యుద్ధముచేయగా శివుడు బ్రహ్మయొక్క ఐదవ తలను నరికివేసాడు. అందువలన శివునకు బ్రహ్మ హత్యాపాతకము చుట్టుకున్నది.
శివుడు నరికిన బ్రహ్మ తలను చేతితో పట్టుకొని ముల్లోకములు తిరుగుతూ ఉండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మ తల ఎండిపోయి పుర్రెగా అయింది. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి ‘భిక్షాందేహి’యని అనగా గృహిణులు భిక్షపట్టుకొని గుమ్మము వద్దకు రాగా శివుని మోహనాకారమును చూచి మోహితులై భిక్షవేసి శివుని వెంట వెళ్ళిపోతున్నారు. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి, కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక, ఈతనికి పురుషత్వము నశించుగాక అని శపించారు.
ఈశ్వరుడు చేసేది లేక జారి క్రిందపడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా? అన్నట్లు భయంకరముగా ఉన్నది. బ్రహ్మ, విష్ణువు శివుని వద్దకు వచ్చి వానిని ఓదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకుని వెళ్ళగా అచ్చట శివునికున్న బ్రహ్మహత్య పాపము పోయింది. భూలోకమునకు వచ్చిన శివుడు లింగాకారముగా మారినందున అప్పటినుండి భక్తులు ఆ లింగమునే పూజించుచు శివసాన్నిధ్యము పొందగలుగుతున్నారు.
Bhagavad Gita Chapter 10 Verse 8 ప్రతిరోజూ ఉదయం లేచి, మనం ఎన్నో కలలతో, ఆశలతో రోజును ప్రారంభిస్తాం.…
Bhagavad Gita Chapter 10 Verse 7 ఈ రోజుల్లో చాలా మంది ఉదయం లేవగానే ఒక రకమైన అలసటతో…
Bhagavad Gita Chapter 10 Verse 6 ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య – "అసలు నేనెవరిని?…
Bhagavad Gita Chapter 10 Verse 4 & 5 ఈ రోజుల్లో చాలా మందిని పట్టి పీడిస్తున్న ఒకే…
Bhagavad Gita Chapter 10 Verse 3 మనలో చాలామంది రాత్రి పడుకునే ముందు ఒకే ఆలోచనతో సతమతమవుతుంటారు. "ఈరోజు…
Bhagavad Gita Chapter 10 Verse 2 మనలో చాలా మంది జీవితం... బయట ప్రపంచంతో యుద్ధం చేయడం కంటే,…