Ramayanam in Telugu-రామాయణం 63-కిష్కిందకు తిరుగు ప్రయాణం

హనుమంతుని ఉత్సాహపూరిత ఆగమనం

Ramayanam Story in Telugu- ఆకాశంలోని మేఘాలను తాగుతున్నాడా అన్నట్లుగా వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిన హనుమంతుడు, ఉత్తర దిక్కున తన కోసం ఎదురుచూస్తున్న వానరుల వద్దకు చేరుకోగానే ఒక పెద్ద ధ్వని చేశాడు. ఆ శబ్దం విన్న వానరులు ‘ఆకాశం బద్దలయిందా’ అని భయపడ్డారు. వారంతా జాంబవంతుడి దగ్గరికి వచ్చి “తాతా, అంత పెద్ద అరుపు వినిపిస్తోంది, అది హనుమంతుడిదేనా?” అని అడిగారు. 👉 బక్తివాహిని రామాయణం విభాగం

జాంబవంతుని ధీమా

జాంబవంతుడు వారికి సమాధానమిస్తూ “అది ఖచ్చితంగా హనుమంతుడే. హనుమంతుడికి ఒక కార్యం అప్పగిస్తే అది నెరవేరకుండా ఉండదు. తాను వెళ్ళిన పని విజయవంతం అయింది కాబట్టే ఇంత పెద్ద మహానాదం చేశాడు” అని చెప్పాడు.

వానరుల ఆనందం మరియు హనుమంతుని ప్రకటన

హనుమంతుడు అంత దూరంలో కనబడగానే వానరులందరూ అతని వైపు పరుగులు తీశారు. హనుమంతుడు సమీపించి “చూడబడెను సీతమ్మ” అని బిగ్గరగా కేక వేసి మహేంద్రగిరి పర్వతం మీద దిగాడు. జాంబవంతుడు, అంగదుడు, గంధమాదనుడు మొదలైన కొందరు తప్ప మిగిలిన వానరులందరూ తమ తోకలను కర్రల్లా నిలువుగా పెట్టి, వాటిని చేతులతో పట్టుకుని హనుమంతుడు దిగిన కొండ ఎక్కి ఆయనను తాకి వెంటనే వెనక్కి పరిగెత్తుతున్నారు.

హనుమంతుని వివరణ

హనుమంతుడు గుహలో ఉన్న అంగదుడు మొదలైన వారికి తన ప్రయాణం గురించి చెప్పాడు. “నిజంగా ఆ రావణుడికి ఎంత గొప్ప తపఃశక్తి ఉందో, సీతమ్మను ముట్టుకున్నా కూడా వాడు బూడిద కాలేదు. సీతమ్మ పాతివ్రత్యం యొక్క శక్తితో రావణుడు ఎప్పుడో మరణించాడు. రాముడు కేవలం నిమిత్తమాత్రుడై బాణం వేసి చంపటమే తరువాయి” అన్నాడు.

అంగదుని తొందరపాటు

అంగదుడు ఆవేశంగా “అంతా తెలిసిపోయింది కదా! ఇంక రాముడికి చెప్పడం ఎందుకు? ఇలాగే వెళ్ళి రావణుడిని సంహరించి సీతమ్మను తీసుకొచ్చి రాముడికి ఇచ్చేద్దాము” అన్నాడు.

జాంబవంతుని హితవు

జాంబవంతుడు అంగదుని వారించి “తప్పు, అలా చేయకూడదు. పెద్దలు చెప్పినట్లు చేయాలి తప్ప స్వతంత్రంగా ప్రవర్తించకూడదు. ఈ విషయాలన్నీ రాముడికి చెప్పి ఆయన ఎలా చెబితే అలా చేద్దాము” అని హితవు పలికాడు.

మధువనంలో వానరుల వినోదం

వారందరూ ముందుకు బయలుదేరారు. అలా వెళుతుండగా వారికి మధువనం కనిపించింది. ఆ మధువనాన్ని దదిముఖుడనే వానరుడు కాపాడుతూ ఉంటాడు. ఆ వనంలోని చెట్ల నిండా తేనెపట్టులు ఉన్నాయి. అక్కడంతా పూల నుండి తీసిన మధువు, పండ్ల నుండి తీసిన మధువు మరియు రకరకాల మధువు పాత్రలలో నింపబడి ఉంది. ఆ వానరులందరూ అంగదుడి దగ్గరికి వెళ్ళి “ఆ మధువనంలోని మధువును త్రాగుదాము” అని అడిగారు.

అంగదుడు సరే అనడంతో వారందరూ లోపలికి వెళ్ళి తేనెపట్టులు పిండుకుని తేనె త్రాగారు. అక్కడ ఉన్న పాత్రలలోని మధువును తాగారు మరియు చెట్లకున్న పండ్లను తిన్నారు. వారంతా ఎక్కువగా తేనె త్రాగడం వలన మత్తుగా కొంతమంది చెట్ల కింద కూర్చుని పాటలు పాడటం మొదలుపెట్టారు. పాటలు పాడుతున్న వారి వీపు మీద కొందరు గుద్దుతున్నారు, మరికొందరు నాట్యాలు చేస్తున్నారు. కొందరు కనిపించిన వారందరికీ నమస్కారం చేస్తూ వెళుతున్నారు. కొందరు పళ్ళు బయట పెట్టి నవ్వుతున్నారు, కొందరు అటూ ఇటూ తిరుగుతున్నారు, కొందరు చెట్ల మీద నుండి కింద పడిపోతున్నారు, మరికొందరు కారణం లేకుండా ఏడుస్తున్నారు.

మధువనం వివరాలుసమాచారం
రక్షకుడుదదిముఖుడు
మధువు రకాలుపువ్వుల మధు, పళ్ళ మధు
వానరుల ప్రవర్తనతేనె త్రాగి మత్తు, ఆటలు, హడావిడి

దదిముఖుని పరాభవం మరియు సుగ్రీవునికి నివేదన

ఆ వానరాలు చేస్తున్న అల్లరికి దదిముఖుడి సైన్యం అడ్డురాగా, వారు వారిని చావగొట్టి తమ వెనుక భాగాలు చూపించారు. ఆ తరువాత వచ్చిన దదిముఖుడిని కూడా కొట్టారు. ఆయన ఏడుస్తూ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాడు. దదిముఖుడు సుగ్రీవుడితో వానర భాషలో ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. మధ్య మధ్యలో హనుమంతుని గురించి చెబుతున్నాడు. దదిముఖుడి మాటలు వింటున్న సుగ్రీవుడి తోక పెరుగుతోంది (వానరులు ఏదైనా సంతోషకరమైన వార్త వింటే వారి తోకలు పెరుగుతాయి). ఒకవైపు దదిముఖుడు ఏడుస్తుంటే సుగ్రీవుడు తోక పెంచడం గమనించిన లక్ష్మణుడు ఆందోళనగా “అసలు ఏమి జరిగింది?” అని అడిగాడు.

సుగ్రీవుని ఊహ మరియు ఆజ్ఞ

“దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరులు మధువనాన్ని నాశనం చేశారు. దక్షిణ దిక్కుకు వెళ్ళిన హనుమంతుడు తప్పకుండా సీతమ్మను చూసి ఉంటాడు” అని లక్ష్మణుడితో చెప్పి సుగ్రీవుడు దదిముఖుడితో “వాళ్ళందరినీ వెంటనే ఇక్కడికి రమ్మను” అని ఆజ్ఞాపించాడు.

వానరుల రాక మరియు నివేదన

దదిముఖుడు వానరులతో “సుగ్రీవుడు రమ్మంటున్నాడు” అని చెప్పగానే వారందరూ ఆకాశంలోకి ఎగిరిపోయి కిష్కింధకు చేరుకున్నారు. వారందరూ రాముడి దగ్గరికి వెళ్ళి “రావణుడు సీతమ్మను లంకలో శింశుపా వృక్షం క్రింద ఉంచాడు. సీతమ్మ చాలా బాధపడుతోంది. మనం తొందరగా వెళ్ళి ఆమెను తీసుకురావాలి” అని చెప్పారు.

రాముని ఆందోళన మరియు హనుమంతుని సమాధానం

రాముడు ఆత్రుతగా “సీత నా యందు ఎలా ఉంది?” అని అడిగాడు. అప్పటివరకు రాముడి చుట్టూ ఉన్న వానరులు ఈ ప్రశ్నకు హనుమంతుడే సమాధానం చెప్పగలడని భావించి అతనికి దారి ఇచ్చారు. హనుమంతుడు దక్షిణ దిక్కుకు నమస్కరించి “సీతమ్మ తపస్సును ఆచరిస్తోంది. మీ యందు పరిపూర్ణమైన ప్రేమతో ఉంది” అని సీతమ్మ చెప్పిన గుర్తులన్నీ చెప్పి చూడామణిని ఇచ్చాడు. “సీతమ్మ కేవలం ఒక నెల మాత్రమే ప్రాణాలను నిలబెట్టుకుంటానని చెప్పింది. మనం తొందరగా బయలుదేరి వెళ్ళి రావణుడిని సంహరించి సీతమ్మను తీసుకురావాలి” అని హనుమంతుడు విన్నవించాడు.

రాముని దుఃఖం మరియు హనుమంతుని ఓదార్పు

రాముడు దుఃఖంతో “సీత జాడ తెలిసిన తరువాత నేను ఒక్క రోజు కూడా ఉండలేను” అని ఏడ్చి, సీత ఎలా ఉందో మళ్ళీ అడిగాడు. హనుమంతుడు సీతమ్మ యొక్క మంచి స్వభావాన్ని మరియు పాతివ్రత్యాన్ని వివరించి “మీకు సుగ్రీవుడికి కలిగిన స్నేహం వలన అమ్మ ఎంతో సంతోషించింది. సుగ్రీవుడిని మరియు మిగిలిన వానరులను క్షేమ సమాచారం అడిగింది.

దుఃఖంతో ఉన్న సీతమ్మ తల్లిని నా మాటలతో ఓదార్చాను. నా మాటలతో ఓదార్చబడిన సీతమ్మ ఇప్పుడు దుఃఖాన్ని వదిలిపెట్టి మీ కోసం మీరు దుఃఖిస్తున్నారని మాత్రమే బాధపడుతోంది” అని చెప్పాడు. హనుమంతుడు తన వాక్చాతుర్యంతో సీతారాములను సంతోషపరిచాడు.

రాముని కృతజ్ఞత మరియు హనుమంతుని సత్కారం

హనుమంతుడు చెప్పిన మాటలు విన్న రాముడు ఎంతో సంతోషించి “హనుమా! నువ్వు చేసిన కార్యం సామాన్యమైన కార్యం కాదు. నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకా పట్టణంలోకి వెళ్లడం అనేది మానసికంగా కూడా ఎవరూ ఊహించని పని. సముద్రాన్ని దాటి, రాక్షసులచేత మరియు రావణుడిచేత కాపాడబడుతున్న లంకా పట్టణంలో ప్రవేశించి, సీతను దర్శించి, నేను చెప్పిన దానికంటే ఎక్కువ కార్యాన్ని నిర్వర్తించి ఎటువంటి అవమానం పొందకుండా తిరిగి రావడం అనేది సాధారణమైన పని కాదు.

సేవకులు మూడు రకాలుగా ఉంటారు. ప్రభువు చెప్పిన పనికంటే తనలో ఉన్న సామర్థ్యంతో ఎక్కువ పని చేసి ప్రభువు యొక్క మనస్సు గెలుచుకోగలిగిన సమర్థత కలిగినవాడు ఉత్తమమైన సేవకుడు. ప్రభువు చెప్పిన పనిని చేసి అంతకంటే ఎక్కువ చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రభువు చెప్పలేదు కనుక మనకెందుకులే అనుకునేవాళ్ళు మధ్యములు. తనకు చేయగలిగే సామర్థ్యం ఉన్నా నేనెందుకు చేయాలి అని ప్రభువు చెప్పిన పనిని కూడా చేయనివాడు అధముడు. ఈరోజు నిన్ను నీవు ఉత్తమమైన సేవకుడిగా నిరూపించుకున్నావు. నా క్షేమ వార్త సీతకు చెప్పి ఆమె మనస్సులో ఉన్న బాధను తొలగించి సుఖాన్ని పొందేటట్లుగా నువ్వు ప్రవర్తించావు. సీత జాడ తెలియక బాధపడుతున్న నాకు ఆమె జాడ చెప్పి సంతోషపరిచావు. నీకు నేను ఏమి ఇచ్చి నీ ఋణం తీర్చుకోగలను? ఈరోజు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు.

నా దగ్గర ఉన్నది ఈ శరీరం మాత్రమే. అందుకని నా శరీరంతో నీ శరీరాన్ని గాఢంగా కౌగలించుకుంటాను” అని హనుమంతుడిని దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగలించుకున్నాడు.

హనుమంతుడి లంకా ప్రయాణం – యానిమేటెడ్ వివరణ 👉 చూడండి

సీతాదేవి దర్శనం అనంతరం హనుమంతుడు వానరులతో కలసిన క్షణం 👉 చూడండి

రాముడి స్పందన – సీత వార్త విన్న తర్వాత 👉 చూడండి

bakthivahini

Share
Published by
bakthivahini

Recent Posts

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 12 శ్లోకాలు

Bhagavath Geetha Telugu ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మీరెప్పుడైనా ఏమీ తోచని గందరగోళాన్ని అనుభవించారా? ఈ కాలంలో చాలామంది…

9 hours ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 10&11 శ్లోకాలు

Bhagavath Geetha Telugu మనిషి సాధారణంగా ఈ ప్రపంచాన్ని తన పరిమితమైన కళ్లతో చూస్తాడు. అందుకే ఒక చిన్న కష్టం…

2 days ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 9 వ శ్లోకం

Bhagavath Geetha Telugu మనం రోజూ ఉదయం లేవగానే ఏదో తెలియని ఒక గందరగోళం. "నా కెరీర్ ఏమవుతుంది? నా…

3 days ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 8 వ శ్లోకం

Bhagavath Geetha Telugu మనం సాధారణంగా మన కళ్ళతో చూసేదే నిజం అని నమ్ముతాం. ఒక వ్యక్తి కోపంగా మాట్లాడితే…

4 days ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 7 వ శ్లోకం

Bhagavath Geetha Telugu మన జీవితంలో చాలాసార్లు మనం చిన్న చిన్న సమస్యలకే కొండంత ఆందోళన పడతాం. రేపు ఏమవుతుందో,…

5 days ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 6 వ శ్లోకం

Bhagavath Geetha Telugu మన జీవితంలో ఎప్పుడో ఒకసారి అద్దం ముందు నిలబడి, "అసలు నాలో ప్రత్యేకమైనది ఏముంది? నా…

6 days ago