Categories: పాటలు

Sravana Sukravaram Song – Divine Melody for Lakshmi Blessings

Sravana Sukravaram Song

కైలాస గిరిలోను కల్పవృక్షము క్రింద ప్రమథాది గణములు కొలువగాను,
పార్వతీ పరమేశ్వరులు బాగుగా కూర్చుండ పరమేశ్వరుని యడిగె పార్వతపుడు.
॥జయ మంగళం నిత్య శుభమంగళం॥

ఏ వ్రతము సంపదల నెలమితోడుత నిచ్చుయే వ్రతము పుత్రపౌత్రాభివృద్ధి నొసగు
అనుచు పార్వతి యా హరుని యడుగంగా పరమేశు డీరీతి పలుకసాగె. ॥జయ॥

కుండినం బనియేటి పట్నంబు లోపల చారుమతి అనియేటి చేడె గలదు
అత్తమామల సేవ అతిభక్తితో జేసి, పతిభక్తి గలిగుండు భాగ్యశాలి. ॥జయ॥

వనిత స్వప్నమునందు వరలక్ష్మి తాబోయి చారుమతి లెమ్మని చేత చరచె,
చరచినప్పుడు లేచి తల్లి మీరెవ్వరని నమస్కరించెనా నలినాక్షికి. ॥జయ॥

వరలక్ష్మినే నేను వరమూలు యిచ్చేను మేల్కొనవె చారుమతి మేలుగాను
కొలచినప్పుడు మెచ్చి కోరిన రాజ్యముల్ వరములా నిచ్చేటి వరలక్ష్మిని. ॥జయ॥

ఏ విధిని పూజను చేయవలెననుచూ చారుమతి యడిగెనూ శ్రావ్యముగనూ
యేమి మాసంబున యేమి పక్షంబున యేవారమూనాడు యే ప్రొద్దున. ॥జయ॥

శ్రావణమాసాన శుక్లపక్షమునందు శుక్రవారమునాడు మునిమాపునా
పంచ కల్వలు దెచ్చి బాగుగా నను నిల్పి భక్తితో పూజించమని చెప్పెను. ॥జయ॥

చారుమతి లేచి యా శయ్యపై కూర్చుండి బంధువుల పిలిపించి బాగుగాను
స్వప్నమున శ్రీమహాలక్ష్మీ చకచక వచ్చి కొల్వమని పల్కెను కాంతలారా. ॥జయ॥

ఏ విధమున పూజ చేయవలెనన్నదో బంధువులుయడిగిరీ ప్రేమతోను,
యేమి మాసంబున యేమి పక్షంబున యేవారమూనాడు యే ప్రొద్దున. ॥జయ॥

శ్రావణమాసాన శుక్లపక్షమునందు శుక్రవారమునాడు మునిమాపునా
పంచ కల్వలు దెచ్చి బాగుగా నను నిల్పి భక్తితో పూజించమని చెప్పెను. ॥జయ॥

అపుడు శ్రావణమాసమది ముందువచ్చెనని భక్తితో పట్నము నలంకరించి
వన్నె తోరణాలు సన్న జాజులతో చెన్నుగా నగరు శృంగారించిరి. ॥జయ॥

వరలక్ష్మీ నోమనుచు వనితలు అందరూ పసుపుతో పట్టుపుట్టములుగట్టి
పూర్ణపు కుడుములూ పాయసాన్నములు అవశ్యముగ నైవేద్యము పెడుదురు. ॥జయ॥

కండి మండిగలు మండిగలుగడగ నెంచి యొండిన కుడుములు ఘనవడలనూ
దండిగా పళ్లేల ఖర్జూర ఫలములూ విధిగ నైవేద్యములు పెడుదురు. ॥జయ॥

నిండు బిందెలలోను నిర్మల వుదకమూ, పుండరీకాక్షునకు వారుపోసి
తొమ్మిది పోగుల తోరమొప్పగ పోసి తల్లికి కడు సంభ్రమునను. ॥జయ॥

వేదవిదుడైనట్టి విప్రుని పిలిపించి గంధనుక్షతలిచ్చి కాళ్లుకడిగి. ॥జయ॥

తొమ్మిది పిండి వంటలలోను రయ మొప్పగ బ్రాహ్మణునకు పాయసం బెట్టుదూరు. ॥జయ॥

శ్రావణ శుక్రవారపు పాట సంపూర్ణమ్.

భావం

కైలాసగిరిలో, కల్పవృక్షం కింద, ప్రమథ గణాలు కొలుస్తూ ఉండగా, పార్వతీ పరమేశ్వరులు చక్కగా కూర్చుని ఉన్న సందర్భాన్ని వివరిస్తుంది. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడిని “ఏ వ్రతం సంపదలను ఇస్తుంది, ఏ వ్రతం పుత్రపౌత్రాభివృద్ధిని ప్రసాదిస్తుంది?” అని అడుగుతుంది. ఆ ప్రశ్నకు పరమేశ్వరుడు ఈ విధంగా బదులివ్వడం ప్రారంభిస్తాడు.

కుండినం అనే పట్టణంలో చారుమతి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె అత్తమామలకు అత్యంత భక్తితో సేవలు చేసేది, అలాగే పతి భక్తి కలిగిన భాగ్యశాలిని. ఒక రోజు రాత్రి, చారుమతికి కలలో వరలక్ష్మి దేవి కనబడి, ఆమెను నిద్ర లేపి “చారుమతీ, లెమ్ము” అని చేత్తో తట్టింది. మెలకువ వచ్చి, చారుమతి “తల్లి, మీరెవరు?” అని నమస్కరించగా, వరలక్ష్మి “నేను వరలక్ష్మిని, వరాలు ఇచ్చేదానిని. మేల్కొనుము, చారుమతీ. నన్ను కొలిచినప్పుడు నేను మెచ్చి, కోరిన రాజ్యాలు, వరాలు ఇచ్చే వరలక్ష్మిని” అని పలికింది.

అప్పుడు చారుమతి, వరలక్ష్మి దేవిని “ఏ విధంగా పూజ చేయాలి? ఏ మాసంలో, ఏ పక్షంలో, ఏ వారంలో, ఏ ప్రొద్దున చేయాలి?” అని వినయంగా అడిగింది. దానికి వరలక్ష్మి దేవి “శ్రావణ మాసంలో, శుక్ల పక్షంలో, శుక్రవారం నాడు, మునిమాపు వేళ (సంధ్యా సమయం) ఐదు కలవలు (కలశాలు) తెచ్చి, నన్ను చక్కగా నిలిపి, భక్తితో పూజించు” అని చెప్పింది.

నిద్ర లేచిన చారుమతి, పడకపై కూర్చుని తన బంధువులను పిలిచి, కలలో శ్రీ మహాలక్ష్మి వచ్చి తనను కొలవమని చెప్పిన విషయాన్ని వివరించింది. అప్పుడు బంధువులు కూడా ప్రేమతో “ఏ విధంగా పూజ చేయమన్నారు? ఏ మాసంలో, ఏ పక్షంలో, ఏ వారంలో, ఏ ప్రొద్దున?” అని అడిగారు. చారుమతి మళ్ళీ వరలక్ష్మి చెప్పిన విధంగానే, “శ్రావణ మాసంలో, శుక్ల పక్షంలో, శుక్రవారం నాడు, మునిమాపు వేళ ఐదు కలవలు తెచ్చి, నన్ను చక్కగా నిలిపి, భక్తితో పూజించమని చెప్పింది” అని తెలియజేసింది.

తర్వాత శ్రావణ మాసం రాగానే, భక్తితో ఆ పట్టణాన్నంతా అలంకరించారు. రంగురంగుల తోరణాలతో, సన్న జాజులతో అందంగా నగరాన్ని శృంగారించారు. వరలక్ష్మి నోము నోముకోవడానికి మహిళలందరూ పసుపుతో, పట్టు చీరలు కట్టుకుని, పూర్ణపు కుడుములను, పాయసాన్నాలను తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పించారు. అలాగే, కుడుములు, వడలు, ఖర్జూర పండ్లు వంటి వివిధ రకాల పిండివంటలు, పండ్లను పళ్ళెల్లో నిండుగా పెట్టి, భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పించారు.

నిండు బిందెలలో స్వచ్ఛమైన నీటిని తీసుకుని, పుండరీకాక్షునికి (విష్ణువుకు) సమర్పించి, తొమ్మిది పోగుల తోరాన్ని చక్కగా తయారుచేసి, తల్లికి (వరలక్ష్మికి) ఎంతో సంబరంగా సమర్పించారు. వేదాలు తెలిసిన బ్రాహ్మణుడిని పిలిపించి, గంధం, అక్షతలు ఇచ్చి, పాదాలు కడిగి సత్కరించారు. చివరగా, తొమ్మిది రకాల పిండివంటలలో పాయసం కలిపి బ్రాహ్మణుడికి సమర్పించారు. ఇది శ్రావణ శుక్రవారపు పాట సంపూర్ణ వివరణ.

👉 YouTube Channel
👉 bakthivahini.com

bakthivahini

Share
Published by
bakthivahini

Recent Posts

Simhachalam Giri Pradakshina 2026 | సింహాచలం గిరి ప్రదక్షిణ

Simhachalam Giri Pradakshina 2026 ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక నిలయం, విశాఖపట్నం తీరంలో వెలసిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ వరాహ…

5 days ago

చాతుర్మాస్య దీక్ష | Chaturmasya Deeksha 2026

చాతుర్మాస్య దీక్ష మన జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగులను నింపి, మానసిక ప్రశాంతతను, శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే అత్యంత పవిత్రమైన కాలం…

6 days ago

Tholi Ekadasi 2026: Life Reset Secrets in Telugu

Tholi Ekadasi 2026 మన సనాతన ధర్మంలో పండుగలకు, వ్రతాలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. అందులోనూ ఆషాఢ శుద్ధ ఏకాదశి…

6 days ago

Varahi Navaratri 2026 | వారాహి దేవి నవరాత్రులు

Varahi Navaratri 2026 జీవితంలో ఎంత కష్టపడినా ఫలితం కనిపించనప్పుడు, ఇంట్లో ప్రశాంతత కరువై ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నప్పుడు మనసు…

3 weeks ago

సంకష్టహర చతుర్థి 2026 ప్రత్యేకం – గణపతి ఆశీస్సులతో విజయం వైపు అడుగులు

సంకష్టహర చతుర్థి 2026 జీవితంలో అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలను తొలగించి, ధైర్యాన్ని, తెలివితేటలను ప్రసాదించే దేవుడు గణపతి. ప్రతి నెలా…

4 weeks ago

ఆషాఢ మాసం వెనుక ఉన్న అసలు సత్యం | ప్రతి హిందువు తప్పక తెలుసుకోవాలి

ఆషాఢ మాసం తెలుగు సంవత్సరంలో నాల్గవ మాసమైన ఆషాఢ మాసం అనగానే చాలామందికి కొత్తగా పెళ్ళైన దంపతులను దూరం పెట్టే…

4 weeks ago