Categories: ఆలయాలు

Vontimitta Ramalayam-Kadapa-ఒంటిమిట్ట కోదండ రామాలయం – ఏకశిలానగరం అద్భుతం!

ఒంటిమిట్ట కోదండ రామాలయం: విశేషాల పుట్ట

Vontimitta Ramalayam-ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచిన ఒంటిమిట్ట, వైఎస్ఆర్ జిల్లాలో (కడప నుండి తిరుపతి వెళ్ళే మార్గంలో కడపకు 27 కి.మీ. దూరంలో) ఉంది. ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు, సీతారామలక్ష్మణులు. ఈ ఆలయం చారిత్రక, రాచరిక ఘట్టాలకు నిలువెత్తు దర్పణంగా నిలుస్తుంది.

  • ఒక (ఒంటి) మిట్టపైన రామాలయం నిర్మించబడింది కాబట్టి ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని ఒక నమ్మకం.
  • ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు ఇక్కడి రాముణ్ణి కొలిచి నిజాయితీగా బ్రతికారని, వారి పేరుమీదుగా ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందంటారు.
  • ఉదయగిరి పాలకుడు కంపరాయల ఆజ్ఞతో ఒంటడు, మిట్టడు రామాలయ నిర్మాణంలో, చెరువు నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని మరొక కథనం కూడా ఉంది.
  • సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఏకశిలతో (అయినా విడివిడిగా) ఉన్నందువల్ల ఈ క్షేత్రం ఏకశిలానగరం అనే పేరుతో కూడా పిలువబడుతుంది.

స్థల పురాణం

రామలక్ష్మణులు బాలురుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుని యాగరక్షణ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక్కడి స్థలపురాణం ప్రకారం శ్రీరాముని వివాహానంతరం అలాంటి సందర్భం ఒకటి ఏర్పడిందట. మృకండుడు, శృంగి అనే ఇద్దరు ఋషులు దుష్టశిక్షణ కోసం శ్రీరాముని ప్రార్థించడంతో సీతాలక్ష్మణసమేతుడైన స్వామి కోదండం, అమ్ములపొది, పిడిబాకు పట్టుకుని వచ్చి యాగరక్షణ చేశాడని అంటారు. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశాడని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఈ దేవాలయంలో సీతాదేవి కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళగంగను పైకి తెచ్చాడని అంటారు. దానిపేరు శ్రీరామతీర్థం.

ఆలయ నిర్మాణం

ఈ కోదండరామాలయానికి విశాలమైన ఆవరణ ఉంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడ్డాయి. 32 శిలాస్తంభాలతో రంగమండపం నిర్మించబడింది. ఇది విజయనగర శిల్పాలతో పోలి ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు, గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల, రథం ఉన్నాయి. చోళ, విజయనగర వాస్తుశైలులు కనిపించే ఆలయ స్తంభాలపై రామాయణ భారత భాగవత కథలు చూడవచ్చు.

విగ్రహాల రకంఏకశిలప్రత్యేకత
రామ, లక్ష్మణ, సీతఒకే రాయి నుండి చెక్కిన విగ్రహాలువిడివిడిగా ఉన్నప్పటికీ ఏకశిలా రూపంలో ఉన్నాయి

ఈ కారణంగా ఈ క్షేత్రాన్ని “ఏకశిలానగరం” అని కూడా పిలుస్తారు.

నిర్మాణ భాగంవివరాలు
గోపురంఎత్తు 160 అడుగులు, చోళ శైలిలో నిర్మాణం
రంగమండపం32 శిలాస్తంభాలతో నిర్మించబడింది
ఆలయ శిల్పాలురామాయణ, భారత, భాగవత ఇతిహాసాల చెక్కబడి ఉన్నాయి

విదేశీయుల ప్రశంసలు

ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావర్నియర్ 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని దర్శించి భారతదేశంలోని గొప్ప గోపురాల్లో ఈ రామాలయ గోపురం ఒకటి అని అన్నాడు.

బ్రహ్మోత్సవాలు

ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. స్వామివారికి వివిధ వాహన సేవలు మరియు కల్యాణోత్సవం అత్యంత కమనీయంగా, కనులపండువుగా జరుగుతాయి.

ఉత్సవంవివరాలు
ప్రారంభంచైత్ర శుద్ధ నవమి
ముగింపుబహుళ విదియ
విశేషాలురాత్రి వేళల్లో వెన్నెల వెలుగులో సీతారామ కల్యాణం

వెన్నెల వెలుగుల్లో సీతారామ కల్యాణం

క్షీరసాగర మథనం తర్వాత మహాలక్ష్మీదేవిని నారాయణుడు సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే వివాహాలన్నీ తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామికి విన్నవించాడు. అప్పుడు స్వామి వెన్నెల వెలుగులలో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరం ఇచ్చాడు. దాని ప్రకారమే రాత్రుల్లో ఇక్కడ స్వామివారి కల్యాణోత్సవాలను నిర్వహిస్తారు.

ఇమామ్ బేగ్ బావి

ఒంటిమిట్ట రామాలయంలో సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఒకటి ఇమాంబగ్ బావి. ఇమాంబగ్ కడపను పాలించిన అబ్దుల్లాఖాన్ ప్రతినిధి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను “మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా?” అని ప్రశ్నించాడట. చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానం ఇచ్చారు. ఆయన రామా అని మూడుసార్లు పిలవగా అందుకు ప్రతిగా మూడుసార్లు సమాధానం వచ్చిందట. ఆశ్చర్యపడిన ఇమాంబేగ్ స్వామి భక్తుడుగా మారిపోయాడు. అక్కడ నీటి అవసరాల కోసం ఒక బావిని తవ్వించాడు. అది ఆయన పేరుతో ఇమామ్ బేగ్ బావిగా వ్యవహరించబడుతోంది. అందువల్ల ప్రతి శనివారం ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ విధంగా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఈ ఆలయం నిలుస్తూ ఉంది.

రామ కవితార్చన చేసిన కవులు

ఈ స్వామికి కవితార్చన చేసిన కవులెందరో. అందులో ముఖ్యులు ప్రౌఢదేవరాయల ఆస్థానంలోని అయ్యల తిమ్మరాజు. ఈయన ఈ ప్రాంతవాసి. స్వామిపై శ్రీరఘువీరశతకం వ్రాశాడు. ఇతని మనుమడే శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాల్లో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు. మరో సుప్రసిద్ధ కవి, సహజ పండితుడు బమ్మెర పోతన. ఈయన భాగవతాన్ని మాత్రం ఈ కోదండరాముడికి అంకితం ఇచ్చాడు. అన్నమయ్య కూడా ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి మీద కొన్ని కీర్తనలు వ్రాశాడు. ఇంకా ఉప్పుగుండూరు వెంకటకవి, వరకవి మొదలైన వారందరూ స్వామిపై కవితార్చన చేసి తరించారు. ఒంటిమిట్టకు పూర్వవైభవం కోసం ప్రయత్నించిన ఆధునికుల్లో సుప్రసిద్ధులు ‘ఆంధ్రవాల్మీకి’ అని పేరుపొందిన వావిలికొలను సుబ్బారావు(1863-1938) ఈ ప్రాంతవాసి. ఈయన రామాలయాన్ని పునరుద్ధరించాడు. స్వామివారికి నగలు చేయించడంతోపాటు రామ సేవాకుటీరాన్ని కూడా నిర్మించాడు. ఈయన వాల్మీకి రామాయణాన్ని తెలుగులో వ్రాసి దానికి సుందరమైన పేరుతో వ్యాఖ్యానం కూడా వ్రాశాడు.

కవిరచన
అయ్యల తిమ్మరాజుశ్రీరఘువీర శతకం
అయ్యలరాజు రామభద్రుడుఅనేక కృతులు
బమ్మెర పోతనతెలుగు భాగవతం
అన్నమయ్యరాముడిపై కీర్తనలు
ఉప్పుగుండూరు వెంకటకవిభక్తి కవిత్వం

ఆధునిక యుగంలో ఒంటిమిట్ట పునరుద్ధరణ

‘ఆంధ్రవాల్మీకి’ వావిలికొలను సుబ్బారావు (1863-1938) ఈ ఆలయ పునరుద్ధరణకు కృషి చేశారు. ఆలయ నగలు చేయించి, రామ సేవా కూటీరాన్ని నిర్మించారు. ఆయన వ్రాసిన తెలుగు రామాయణానికి విశేష ప్రాచుర్యం ఉంది.

సందర్శన సమాచారం

సమాచారంవివరాలు
స్థానముఒంటిమిట్ట, వైఎస్ఆర్ జిల్లా
సమీప నగరంకడప (27 కి.మీ.)
ప్రసిద్ధిఆంధ్ర భద్రాచలం

ఉపసంహారం

ఒంటిమిట్ట కోదండ రామాలయం ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక విశిష్టత కలిగిన ప్రదేశం. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆలయ మహిమ మరింత వ్యాపించాలని ఆకాంక్షిద్దాం.

Vontimitta Ramalayam-మరింత సమాచారం కోసం

youtu.be/QhRVCvdsjJ4

bakthivahini

Share
Published by
bakthivahini

Recent Posts

Chandanotsavam 2026 Date, Timings, Darshan Details & Significance – Complete Guide

Chandanotsavam 2026 ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన సింహాచలం ఆలయంలో జరిగే 'చందనోత్సవం' వేడుక, భక్తులకు అత్యంత…

4 weeks ago

Akshaya Tritiya 2026 Date, Time, Pooja Vidhanam & Benefits | Complete Guide

Akshaya Tritiya 2026 Date, Time మన భారతీయ సంస్కృతిలో కొన్ని రోజులు సాధారణంగా కాకుండా, ఆధ్యాత్మికంగా చాలా గొప్ప…

4 weeks ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 39 శ్లోకం

Bhagavath Geetha Telugu సాధారణంగా మనకు ఒక అలవాటు ఉంటుంది; మన దగ్గర ఉన్న వంద మంచి విషయాలను వదిలేసి,…

1 month ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 38 శ్లోకం

Bhagavath Geetha Telugu చాలామంది నిత్యం ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉంటారు, కానీ రోజు చివరలో "నేను…

1 month ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 37 శ్లోకం

Bhagavath Geetha Telugu జీవితంలో మనం తరచుగా మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుంటాం. ఇతరుల విజయాలతో మనల్ని పోల్చుకుంటూ,…

1 month ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 36 శ్లోకం

Bhagavath Geetha Telugu కొంతమంది వ్యక్తులు ఒక గదిలోకి రాగానే అక్కడ ఉన్న వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోతుంది. అందరి…

1 month ago