Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 15వ రోజు పారాయణ

Karthika Puranam Telugu

కార్తీక పౌర్ణమి: వనభోజన సంబరం

ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన, నైమిశారణ్యంలోని మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు. వారు ధాత్రీ వృక్షసంయుతమైన చక్కటి ప్రదేశాన్ని (ఉసిరిచెట్లు ఉన్న మంచి చోటును) చేరారు.

ఉసిరిచెట్టు క్రింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమని ఏర్పరచారు. వారు ఉసిరికలతో హరిని పూజించారు. అనంతరం ‘గోవింద’ నామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు.

వనభోజనం తరువాత చేయవలసిన ఇతర కర్మలను నిర్వహించుకుని, సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్నవారై , మునులు తులసీ బృందావనాన్ని ఏర్పరచుకున్నారు. అక్కడ విష్ణువును తిరిగి కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు. ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠాదుల్ని కూడా చేశారు.

మునులందరూ ‘ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః’ అంటూ నమస్కరించి , దీపారాధనలను చేశారు.

షోడశోపచార పూజ, దీప సమర్పణ

వారు విష్ణువును షోడశోపచారాలతోనూ పూజించారు. ఆ ఉపచారాలు ఏవనగా: ధ్యానావాహన, ఆసన, ఆర్ఘ్య, పాద్య, ఆచమన, మథుపర్క, స్నాన, వస్త్ర, ఆభరణ, గంధ, పుష్పాక్షత, ధూపదీప నైవేద్యాదులు, పుష్పహారాలంకరణ, నమస్కారాలు.

అంతేకాకుండా, వారు విష్ణువుకు ఎదురుగా చిలవలు పలవలు లేని మంచి కలపస్తంభాన్ని నాటి , దాని మీద శాలివ్రీహి ధాన్య తిలాదుల (వరి, నువ్వులు మొదలైన ధాన్యాల) ను పోసి , ఆ పైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు.

కథా స్మరణ, దానధర్మాలు

అనంతరం, వారు కార్తీక మాసాదిగా తాము చెప్పుకొనిన స్కాంద పురాణాంతర్గత విశేషాలను తిరిగి గుర్తుచేసుకున్నారు. ఆ విశేషాలు, సోమవార వ్రత, కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్యసంచయ కథా స్వరూపాలైన:

  • తత్త్వనిష్టోపాఖ్యానము
  • శత్రుజిచ్ఛరితము
  • వనభోజన మహిమ
  • దేవదత్తోపాఖ్యానము
  • అజామిళోపాఖ్యానము
  • మంధరోపాఖ్యానము
  • శ్రుత కీర్త్యుపాఖ్యానము
  • అంబరీషోపాఖ్యానము

మొదలైన వానిని పునః పునః మననం చేసుకున్నారు.

తదుపరి, మునులందరూ కూడి , యజ్ఞ దర్శనార్థమూ, సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థమూ నైమిశారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు:

  • ఉసిరికలనూ
  • కార్తీక దీపాలనూ
  • దక్షిణ తాంబూలాదులతో సహా

సమర్పించారు.

హరినామ సంకీర్తనతో రాత్రి గడిపారు

ఆ రాత్రి కాలాతిక్రమణాన్నీ కూడా లెక్క చేయకుండా (ఎంత సమయం గడిచిందో పట్టించుకోకుండా) , మునులు హరినామ స్మరణలతో, సంకీర్తనతోనూ, నృత్యగానద్యుపచార సమర్పణలతోనూ గడిపారు. భక్తి పారవశ్యంతో తన్మయులై, జన్మసాఫల్య సంతృప్తులయ్యారు సౌతశౌనకాది ముని ప్రవరులు.

పదునైదవ (పౌర్ణమి) రోజు పారాయణము సమాప్తము.

bakthivahini

Recent Posts

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 13 శ్లోకాలు

Bhagavath Geetha Telugu ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దశలో సందేహాలు, భయాలు, ఊహించని సమస్యలు ఎదురుకావడం చాలా…

10 hours ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 12 శ్లోకాలు

Bhagavath Geetha Telugu ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మీరెప్పుడైనా ఏమీ తోచని గందరగోళాన్ని అనుభవించారా? ఈ కాలంలో చాలామంది…

23 hours ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 10&11 శ్లోకాలు

Bhagavath Geetha Telugu మనిషి సాధారణంగా ఈ ప్రపంచాన్ని తన పరిమితమైన కళ్లతో చూస్తాడు. అందుకే ఒక చిన్న కష్టం…

2 days ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 9 వ శ్లోకం

Bhagavath Geetha Telugu మనం రోజూ ఉదయం లేవగానే ఏదో తెలియని ఒక గందరగోళం. "నా కెరీర్ ఏమవుతుంది? నా…

3 days ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 8 వ శ్లోకం

Bhagavath Geetha Telugu మనం సాధారణంగా మన కళ్ళతో చూసేదే నిజం అని నమ్ముతాం. ఒక వ్యక్తి కోపంగా మాట్లాడితే…

4 days ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 7 వ శ్లోకం

Bhagavath Geetha Telugu మన జీవితంలో చాలాసార్లు మనం చిన్న చిన్న సమస్యలకే కొండంత ఆందోళన పడతాం. రేపు ఏమవుతుందో,…

5 days ago